
Latest Telugu Movie News
Telugu Movie news
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉంటున్నారు. పాలిటిక్స్లో పవన్ బిజీగా ఉండటంతో సినిమాలను ఆయన ఆచి తూచి చేస్తూ వస్తున్నారు. గ్యాప్ ఉన్నప్పుడు సమయాన్నంతా సినిమాలకే కేటాయిస్తున్నారు. ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ లిస్టులో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా ఉన్న సంగతి తెలిసిందే..
NBK 107 : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విదేశాలకు ఎందుకు వెళుతున్నారు. ఆయనకు ఏమైంది? అని కంగారు పడకండి.. ఆయన వెళుతుంది వ్యక్తిగత విషయంపై కాదు.. సినిమా కోసం. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను ఫారిన్లో ప్లాన్ చేసింది. సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న వార్తల మేరకు బాలయ్య సహా..
దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన సీతా రామం (Sita Ramam) బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీక్షించారు. ట్విట్టర్లో ఈ మూవీ గురించి పంచుకున్నారు.
ఆపరేషన్ గరుడ అంటూ గత ఎన్నికల ముందు పెద్ద రగడ చేశారు హీరో శివాజీ. టీడీపీ పార్టీకి వీరవిధేయుడిగా ఆ పార్టీ గెలుపు కోసం ఎంత ప్రయత్నించినా హీరో గారి ఆశలు ఫలించలేదు. అయితే ఎన్నికల తరువాత సైలెంట్ అయిన శివాజీ.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈసారి సర్వే రిపోర్ట్ అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav)పై ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తి జాతీయ జెండాకు వందనం చేసేందుకు వచ్చాడని సీరియస్ అయ్యారు.
కార్తికేయ 2 (Karthikeya 2) మూవీపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రశంసల జల్లు కురిపించారు. డైరెక్టర్ చందు మొండేటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అభినందించారు.
నేచురాల్ స్టార్ నాని (Nani) డ్యూయల్ రోల్లో నటించిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
అలనాటి నటి సావిత్రి (Savitri) రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన మూవీ మహానటి (Mahanati). బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. కాగా.. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ను తీసుకుందామని అనుకున్నామని నిర్మాత అశ్వనీదత్ అన్నారు. కానీ..
హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఓ సినిమా షూటింగ్లో సీనియర్ నటుడు నాజర్ (Nassar) గాయపడ్డారు. ఆయనను చిత్ర బృందం ఆసుపత్రికి తరలించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేశాడు. మాజీ మిస్ వరల్డ్ సుస్మితా సేన్ (Sushmita Sen) అంటే తనకు ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూ చైతూ చెప్పాడు.
టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్ ఖాన్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఎందుకొట్టావ్ రా వాళ్లని అని ఓ వ్యక్తి ఆది (చైల్డ్ ఆర్టిస్టు)ని అడిగితే..‘మా అమ్మను తప్పుగా చూశారు..మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతానంటూ’ చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయిందిట్రైలర్. ఆది పాత్ర పోలీసాఫీసర్గా ఫన్, సీరియస్ యాంగిల్లో ఎంటర్ టైనింగ్ టచ్ ఇస్తూ సాగనున్నట్టు ట్రైలర్తో చెప్పేశాడు దర్శకుడు.
పాయల్, ఆది మధ్య లవ్ ట్రాక్ కూడా మూవీ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన తీస్ మార్ ఖాన్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పూర్ణ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రల్లో నటించారు. సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది.
{youtube}v=-fgpxjPRj20|620|400|1{/youtube}
టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్కు ఆ అంచనాలు కాస్త రెట్టింపయ్యాయి. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. ఇప్పటికే పలు మేజర్ సిటీల్లో ప్రమోషన్లను జరపుతూ చిత్రబృందం సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 860 థియేటర్లలో విడుదల కానుంది. ఇటు తెలుగు రాష్ట్రాలలో మాత్రం కేవలం 350 స్ర్కీన్స్ లో ఈ చిత్రం ప్రదర్శించబడునుంది. నైజాంలో 115, సీడెడ్ లో 50, ఆంధ్రలో 185 థియేటర్లలో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. ఇక కర్ణాటక సహా రెస్టాప్ ఇండియాలో 80 ధియేటర్లు, మలయం, తమిళ రాష్ట్రాలలోని దాదాపు 180 థియేటర్లు, ఇతర రాష్ట్రాలలో 250 ధియేటర్లతో కలిపి మొత్తంగా 860 థియేటర్లలలో ఈ చిత్రం విడుదల కానుంది.
‘సీతారామం’ చిత్రానికి దాదాపు రూ.18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.19.50 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి ఉన్నక్రేజ్కు హిట్ టాక్ వస్తే వారంలోగానే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్పై స్వప్న దత్ నిర్మించింది.
{youtube}v=Ljk6tGZ1l3A|620|400|1{/youtube}
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. టైటిల్ రోల్ ప్లే చేస్తూ కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’ టీజర్, ట్రైలర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు చిత్రంపై అంచనాలు కూడా అమాంతం పెంచాయి. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, ఎన్ని స్ర్కీన్స్ పై విడుదల కానుంది. వాటిలో తెలుగు రాష్ట్రాల ధియేటర్ల సంఖ్య ఎంత అన్న వివరాలు ఇలా ఉన్నాయి.
ప్యాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ బింబిసార చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ పిరియాడిక్ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేయగా.. ఇక ఈ చిత్ర నిడివి 2 గంటల 26 నిమిషాలగా ఉంది. సినిమా రిచ్ గా, సస్పెన్స్ థ్రిల్లర్గా ఉందని, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందని సెన్సార్ వాళ్లు చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు.
కళ్యాణ్ రామ్ బింబిసార ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) రూ. 5 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ రూ. 6.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 13.50 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 1.1 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1 కోటి రూపాయలు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 15.60 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ. 16.20 కోట్లు రాబట్టాలి. ఇదిలాఉండే చిత్రం రూపోందించడానికి అయిన బడ్జెట్ మొత్తం ఏకంగా రూ. 40 కోట్లుగా చిత్రవర్గాలు నుంచి సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 685 థియేటరల్లో అడనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 975 స్ర్కీన్స్ పై చిత్రం విడుదల కానుంది.
{youtube}v=aosg9hapID4|620|400|1{/youtube}
తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో ఈయన సినిమాలకు ఇక్కడి టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలన్నాయి. అందులో ‘విరుమన్’ ఒకటి.
ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తి మాస్ ఫైట్లతో అదరగొట్టాడు. ప్రకాష్రాజ్కు వార్నింగ్ ఇచ్చే సీన్లు ఆకట్టుకుంటున్నాయి. సూరి కామెడీ పంచ్లు నవ్విస్తున్నాయి. కార్తి, అధితి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఈ అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 12న గ్రాండ్గా విడుదల కానుంది.
{youtube}v=aRx4-fsJ5uE|620|400|1{/youtube}
దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఓ ఆడియో ఫంక్షన్లో సాయిపల్లవి క్రేజ్ చూసి సుకుమార్.. ‘లేడి పవర్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గుడపుతుంది.
ఇటీవలే ఈమె నటించిన ‘గార్గి’ విడుదలై ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో సాయిపల్లవి తన సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘గార్గి’ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్లో ఆగస్టు 12 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలకు నాలుగు వారాలకు డిజిటల్లో విడుదలవుతుంది. ఈ మధ్య చాలా వరకు సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన గార్గి కేవలం వారంలోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా దగ్గుబాటి విడుదల చేశాడు. సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్లో శివకార్తికేయన్కు జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది.
{youtube}v=rWC4AJezXPM|620|400|1{/youtube}
నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకులను నిరాశపరిచిన సత్యదేవ్ ఈ సారి కృష్ణమ్మతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు.
ఈ క్రమంలోనే మొదటి సారి పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు. ‘ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవ్వడికి తెలియదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా, పుట్టిన ప్రతి ఒకడికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడక ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడు గెలక్కూడదు. కానీ గెలికారు’ అంటూ సత్యదేవ్ పలికే సంభాషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సత్యదేవ్ మొదటి సారిగా ఓ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో అంచనాలు నెలకొల్పయి. ఇక తాజాగా విడులైన టీజర్ అంచనాలను అమాంతం పెంచింది. ఈ చిత్రంలో సత్యదేవ్కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నాడు.
{youtube}v=5DK-0O71FAQ|620|400|1{/youtube}
టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఈక్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
‘ఒక లయన్కి టైగర్కు పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ మొత్తం విజయ్ ఊరమాస్ లుక్తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్కు నత్తి ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్లో ‘ఐ లవ్ యూ’, ‘ఐ అమ్ ఎ ఫైటర్’ అంటూ నత్తితో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫి బాగుంది. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది.
ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ రెట్టింపు చేసింది. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
{youtube}v=koYN8qSk_Us|620|400|1{/youtube}
కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్గా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్రాజా ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ఒకటి. శరత్మండవ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.
ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానున్న క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’, ‘సొట్ట బుగ్గల’, నా పేరు సీసా సాంగ్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ ది క్రౌడ్’ అంటూ సాగే ఈ సినిమా టైటిల్ సాంగ్ను జూలై 22న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిందర వందరగా పడిఉన్న ఫైల్స్ మధ్యలో నిల్చుని రవితేజ ఇంటెన్సీవ్గా చూస్తున్నాడు.
మాస్ మహరాజ్ రామారావుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈ స్టిల్ లో ఆయన నీడ చెస్లోని కింగ్ సింబల్ను సూచిస్తుంది. రవితేజకు జోడీగా ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్గా కనిపించబోతున్నాడు.
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ‘లవ్స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరు మీదున్న చైతన్య ‘థాంక్యూ’తో హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదల కానుంది. ఇక చైతన్య నటించిన మరో చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
తాజాగా ఈ చిత్రం నుండి నాగచైతన్య ఫస్ట్లుక్ పోస్టర్ను చిరంజీవి విడుదల చేశాడు. ఈ చిత్రంలో నాగచైతన్య ‘బాలరాజు’ పాత్రలో.. దక్షిణాదికి చెందిన ఆర్మీ అధికారిగా నటించాడు. లేటెస్ట్గా విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘రుద్రవీణ’, ‘త్రినేత్రుడు’ తర్వాత చిరు ఈ సినిమాను సమర్పించడం విశేషం అనే చెప్పాలి.
ఇక నాగచైతన్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్ను చేస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుంది. దీని తర్వాత ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.
‘హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ చిత్రాల తరువాత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తరువాత వరుస ఫ్లాప్లు వెంటాడటంతో మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. కానీ అవి కూడా వరుణ్ కెరీర్కు పెద్దగా ప్లస్ కాలేదు. దాంతో ఎక్కడ పడేసుకున్నాడో అక్కడే వెతకాలని నిర్ణయించుకున్నాడు.
టాలీవుడ్ లోకి తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ సినిమా ‘ఇందువదన’ కూడా ఫ్లాప్గా మిగిలింది. ఇది కూడా వరుణ్ కు నిరాశనే మిగిల్చింది. దీంతో వరుణ్ సందేశ్ ఈ సారి రూటు మార్చి.. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. రమేష్ జక్కాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ ‘యద్భావం తద్భవతి’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఇవాళ వరుణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో వరుణ్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి నోట్లో సిగరెట్ కాల్చూతూ.. చేతి సంకెళ్ళను తెంచుకుని గన్తో ఫైరింగ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సారి సరికొత్త క్యారెక్టర్తో వరుణ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు సందీప్ కిషన్-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైఖేల్ సినిమాలో వరుణ్ సందేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
Tollywood News (English version)
Vijayendra Prasad is not busy with his son Rajamouli's Mahesh Babu-starrer alone.
'Liger', which is heading to theatres on Aug 25, is in the news for an interesting reason.
Vijay Deverakonda's list of admirers among Bollywood heroines is a growing one.
Sudheer Babu's upcoming collaboration with Mohanakrishna Indraganti is titled 'Aa Ammayi Gurinchi Meeku Cheppali'.
Yet another film is set to hit the cinemas in September.
'Shyam Singha Roy', starring Nani, Sai Pallavi and Krithi Shetty, was released in theatres last December.
It is time for a new season of the South Indian International Movie Awards (SIIMA).
Prabhas earlier today took to Instagram stories to wish the 'Karthikeya 2' team on their film's box office success.
'Tees Maar Khan' is heading to theatres on Aug 19.
The success meet of Karthikeya 2 was held on Tuesday at a star hotel in Hyderabad.
About Tollywood
Tollywood refers to the Telugu language film industry. The name derives the concept from Hollywood.Tollywood is based in the state of Andhra Pradesh in southern India. The major Tollywood studios are located in Hyderabad, AP. Tollywood is the largest producer of films in India. In average Tollywood produces between 200 and 250 Telugu movies a year.
Popular movies tend to open during the three festive seasons of the region: Sankranthi, Summer, and Dushera. The Telugu film industry accounts for 1% of the gross domestic product of Andhra Pradesh. Telugu films enjoy significant patronage in the neighboring southern States like Tamil Nadu, Karnataka.
The first Telugu film Bhishma Pratigna was made in 1922 by R.S. Prakash. The first Telugu talkie Bhakta Prahlada, was released in 1931.
Andhra Pradesh is the state having more than 2700 theaters, where Hyderabad alone consists of 150 theatres. It is arguably the state having the largest number of theaters.
For young heroines, waiting for a break in Bollywood - telugu movies are good place to begin with and are considered a gateway. This is because Tollywood is the biggest regional movie market in India and the work there is closely monitored by the big names in Hindi film industry who are on the lookout for storylines to remake and fresh talent be it actors or technicians.